బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీచేస్తే బాగుంటుందనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్ద పల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్నేత పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరడంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహలు రచిస్తున్నారు.