ఏపీలో బర్డ్ ఫ్లూ కలవర పెడుతోంది. జిల్లాలో ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లల్లో ప్రబలే బర్డ్ ఫ్లూ వ్యాధి చిత్తూరు, నెల్లూరు జిల్లాల పౌల్ట్రీ ఫార్మ్ రైతులను కుదేలు చేస్తోంది. లక్షలకు పైగా కోళ్లు కోడిగుడ్లు ఎగుమతులు ఆగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు.. జిల్లాలో పౌల్ట్రీ ఉత్పత్తులు, ఎగుమతుల సంక్షోభానికి కారణం కావడంతో… రైతాంగం లబోదిబోమంటోంది. అయినప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , వెటర్నరీ వర్సిటీ పెథాలజీ హెడ్ ఆనంద్కుమార్ ప్రకటించారు.