జగన్ పై దాడి … నేతల స్పందనలు

జగన్ పై దాడికి టీడీపీ కుట్ర

సీఎం జగన్ పై దాడికి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై దాడి చేశారని అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారని విమర్శించారు. సిద్దం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేద న్నారు. లోకేష్ ట్విట్టర్‌లో 2019 లో కోడి కత్తి, 2024లో రాయి దాడి అని పెట్టారుఅయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుం దన్నారు. ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

జగన్‌పై దాడి పిరికిపంద చర్య-ముద్రగడ

సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పిరికి పంద చర్య అని మండిపడ్డారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. జగన్‌పై విజయవాడలో జరిగిన దాడిని ఆయన ఖండించారు. బస్సు యాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. హత్యా రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముద్రగడ అన్నారు.

ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి చేశారు- వాసిరెడ్డి పద్మ

ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి చేశారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సీఎం జగన్‌ ను చంపాలని బాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై చంద్రబాబు ఎందుకు విచారణ కోరడం లేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగాల్లో జగన్ను మసి చేస్తామని మట్లాడారని, ఇప్పుడు ఆ మాటల వెనుక ఉద్దేశం అర్ధమవుతోందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.

జగన్‌పై హత్యాయత్నం అంతా డ్రామా-ఎంపీ రఘురామ

జగన్‌పై హత్యాయత్నం అంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామ. ప్రజలందరూ ఈ దాడిని నాటకంగానే భావిస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తిపై ఇంత సులభంగా దాడి జరగుతుందా అని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఉన్న స్థలాన్ని చూసుకుని వైసీపీ నేతలు కావాలనే నాటకాలాడుతున్నారని తెలిపారు. తాను ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నానని అసెంబ్లీ కా, పార్లమెంటుకా అన్నది అప్పుడే చెప్తా నని రఘురామ క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో జగన్నాటకానికి తెర లేపారు – ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి

రాష్ట్రంలో సీఎం మరో జగన్నాటకానికి తెర లేపారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులే కుట్రలు చేసి రాళ్ల దాడి చేయించారన్నారు. దీనికి రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాలని… బాధ్యతారహి తంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్నాటాకానికి సానుభూతి చూపే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. రాయి దాడిని ప్రతిపక్షపార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాంగోపాల్‌ రెడ్డి అన్నారు.

జగన్‌పై దాడిని ఖండించిన మాజీమంత్రి బాలినేని

బస్సుయాత్రలో జగన్‌పై దాడిని ఖండించారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. ఇటీవల ఒంగోలులో కూడా తమ కుటుంబం పై దాడికి ప్రయత్నిం చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించమని చెప్పారు. ఓడిపోతున్నమనే ఫ్రస్టేషన్ లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని బాలినేని విమ ర్శలు చేశారు.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్