రంగారెడ్డి(Ranga Reddy ) జిల్లా రాజేంద్రనగర్లో కాలిన గాయాలతో ఓ మహిళ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 వద్ద ఓ మహిళ తీవ్రంగా కాలిపోయి అవస్థలు పడుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయాలతో కాలిపోయి ఉన్న ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. బాధితురాలు అత్తాపూర్ కు చెందిన శివానిగా గుర్తించారు. అయితే ఈ ఘటన గురించి ఆమెను ఆరా తీయగా.. తన భర్తే తగులబెట్టాడని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజంగా భర్తే తగలబెట్టాడా? లేదా తనకు తానే తగలబెట్టుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలిపోయిన శరీరంతో రోడ్డుపై మహిళ
0
345
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


