22.9 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

అరవింద్ ఏడబాయె నీ బెంజ్ కారు ముచ్చట?- ఎమ్మెల్సీ కవిత

పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. కానీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

” పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్‌ పాటించకుండా కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని ప్రారంభించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం.

2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రెండు సార్లు కలిశాను. పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తూనే పసుపు ఆధారిత పరిశ్రమల కోసం కృషి చేశాను. పసుపుకు రూ. 15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశాను. ఇందుకోసం అలుపెరగని పోరాటం చేశాను. కేవలం బోర్డు వస్తే సరిపోదు…. మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతోంది. దాంతో రైతులు నష్టపోతున్నారు.

పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో నేను డిమాండ్ చేస్తున్నాను. 2014లో 8 లక్షల క్వింటాళ్లు దిగుమతి అయితే… ఇప్పుడు రెట్టింపయ్యింది. ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే… వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలి. పసుపుకు రూ. 15 వేల మద్ధతు ధర ప్రకటించాలి.

ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు. తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్.. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని అన్నారు. తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైంది. అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదం. స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది… పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే… అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు ?. ఎందుకు రకరకాల మాటలు చెబుతున్నారు ?. ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి.

ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది. కానీ అది తన ఘనత అని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి. స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం 42 ఎకరాలు కేటాయించింది. ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది. అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్‌ను డిమాండ్ చేస్తున్నా.. అని కవిత చెప్పారు.

Latest Articles

అర్జెంటినాలో అధికారులు అర్జంట్ గా చేస్తున్న పని ఏమిటో తెలుసా…? సరండీ నది సరౌండింగ్స్ క్లీనింగ్ కు ప్లానింగ్

పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు...ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్