ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ పదవీకాలం పొడిగింపు

  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఆయ‌న స‌ర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు అభ్యర్థన మేర‌కు తాజాగా సీఎస్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Articles

బాల్క సుమన్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బాల్క సుమన్‌ వెంట అతని లాయర్‌ లక్ష్మణ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్