42.2 C
Hyderabad
Friday, April 26, 2024
spot_img

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తులతో ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు బోల్తా పడింది. తిరుపతి వెళ్తుండగా మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు డివైడర్ ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న SPF సిబ్బంది అప్రమత్తమై బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ఘటనలో డ్రైవర్‌, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది భక్తులు ఉన్నారు. అధికవేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా కొద్దిరోజుల క్రితం కూడా మొదటి ఘాట్ రోడ్డులోనే భక్తులతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పడంతో ఇద్దరు మహిళలు చనిపోయిన సంగతి తెలిసిందే.

Latest Articles

ఇది ఏ సినిమాకూ కాపీ కాదు.. ఫ్రెష్ లవ్ స్టోరీ: నిర్మాత రాహుల్ శ్రీవాత్సవ్

ఎస్‌కేఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీవాత్సవ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్