విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోమంత్రి అమిత్షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) ప్రాంగణాన్ని అమిత్షా ప్రారంభించారు.
ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డేలో హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రూ.160 కోట్ల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం క్యాంపస్లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10 బెటాలియన్ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయి?.. ఎలాంటి సహాయక చర్యలు చేపడతాయి?.. ఎంత త్వరగా ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలిస్తారు?.. అనే విషయాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రదర్శించాయి. వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిలకించారు.