చిరుతపులి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సంచరిస్తోందని ఇన్నాళ్లూ భావించిన అటవీ శాఖ అధికారులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ చిరుత పులి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కడియం నర్సరీలో చిరుత పులి సంచరిస్తోందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఇప్పుడు కోనసీమ జిల్లాలోని ఆలమూరు, మండపేట మండలాల పరిధిలో సంచరించే అవకాశాలున్నాయని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పశువుల కొట్టాల వద్ద వొంటరిగా ఉండరాదని, వ్యవసాయ పనుల కోసం అందరూ కలిసికట్టుగా తిరగాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా అనుమానాలు కానీ, అడుగుజాడలు కానీ కనిపిస్తే వెంటనే అధికార యంత్రాంగానికి తెలియజేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద రావు సూచిస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చిరుతపులి సంచారం.?
0
287
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


