స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నిన్న సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి నిన్న రాత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా ఉన్నారు. తమపై నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో అమిత్ షాకు లోకేశ్ వివరించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా? అని ఎద్దేవా చేశారు.
అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా?.. అంబటి రాంబాబు
0
398
Previous article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


