సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ను సినీ ప్రముఖులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ‘పుష్ప-2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ను, ఆయన తండ్రిని పరామర్శించారు.
శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున కోటి, ‘పుష్ప-2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు రూపాయలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని..ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. 2 కోట్ల రూపాయల చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.