29.2 C
Hyderabad
Sunday, May 18, 2025
spot_img

నేడు ఏపీలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం

    విజయవాడలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరువుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్ను కోనున్నారు ఎమ్మెల్యేలు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి, తీర్మాన ప్రతిని అందించి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్న వరం దగ్గర కేసరపల్లిలోని ఐటీ పార్క్‌ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్