Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బ్రాండెడ్ లేబుల్స్ తో కల్తీ వస్తువుల అమ్మకాలు

      నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త రీతుల్లో మోసాలకు దిగుతున్నారు. అతి తెలివి ప్రదర్శించబోయి బోల్తా పడుతున్నారు. చివరకు, పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. బ్రాండెడ్ లేబుల్ బిల్డప్, డూప్లికేట్ ప్రోడక్ట్.. ఈ రీతిన కొందరు అక్రమవ్యాపారం సాగించారు. అయితే, టాస్క్ ఫోర్స్ పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేక పోయారు.

    నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చోవడం సాధారణ విషయమే. మోయలేని ధరాభారాన్ని మోస్తూ సగటు జీవి రోజులు భారంగా గడపడం ఎప్పుడూ ఉండే తంతే. అయితే, బోల్డు డబ్బు చెల్లించి కొన్న సరకు కల్తీది, నకిలీదని తేలితే ఆ కొనుగోలుదారు ఎంత ఆవేదనకు గురవుతారు. ఈ ఇంగితం అక్రమ విక్రేతలకు ఎందుకుంటుంది. స్వార్థం నర నరాన నిండిపోయిన కొందరు మోసగాళ్లు…కల్తీ నిత్యావసర వస్తువులకు బ్రాండెడ్ లేబుల్స్ తగిలించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు.

     నాగారం, కాటేదాన్ నుంచి ఈ దందా సాగుతున్నట్టు గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాజస్థాన్, బీహార్ లకు చెందిన కొందరు కేటుగాళ్లు ఈ దందా సాగిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. నకిలీ తయారీ సెంటర్లను సీజ్ చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రొడక్టులను సీజ్ చేశారు. టీపౌడర్స్, వాషింగ్ పౌడర్స్, వాషింగ్ బార్స్, సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా నిత్యావసర వస్తువులన్నీ కల్తీ చేసి.. బ్రాండెడ్ లేబుల్స్ తో ఈ నేరగాళ్లు విక్రయాలు సాగిస్తున్నారు.బ్రాండెడ్ ప్రొడక్టుల రేట్ల కన్నా ఈ ధరలు తక్కువ ఉండటంతో డిస్కౌంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఈ నేరంలో భాగస్వామ్యం అవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ కల్తీ వస్తువులను కిరాణా షాపులకు అంటగడుతున్నారు. సామాన్య జనం గుర్తుపట్టనంతగా లేబుళ్ళు ఉంటున్నాయి. దీంతో, గత రెండేళ్లుగా డూప్లికేట్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయల మాదిరి సాగిపోయింది. అయితే, పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టేసి, ప్రొడక్షన్ యూనిట్లను సీజ్ చేసేశారు.

      రెడ్ లేబుల్, బ్రూక్ బ్రాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, పారచూట్ హెయిర్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలా, సర్ఫ్ ఎక్సల్ తదితర బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి లేబుల్స్ వేసి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హానికరమైన కెమికల్స్ తో తయారు చేసిన ప్రొడక్ట్ లను మార్కెట్లో అమ్ముతున్నారు. నాగారం, కాటేదాన్ లో ఉన్న యూనిట్ల పై రెయిడ్ చేసి రెండు కోట్ల రూపాయల విలువైన డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులంతా బీహార్, రాజస్థాన్ కి చెందిన వారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.నగర శివారులో ఈ డూప్లికేట్ ప్రోడక్ట్ ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ రశ్మి పెరుమాళ్ తెలిపారు. ఎమ్మార్పీ ధర కన్నా తక్కువకే డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ డూప్లికేట్ ప్రొడక్టులను అమ్ముతున్నారన్నారు. కల్తీ సరుకు వల్ల హెల్త్ కి హాని కలిగే ప్రమాదం ఉందని పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్ మొత్తం వీరి నెట్కర్క్ ఉందని.. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారా అనే అంశాలపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిపారు. నకిలీ దందాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ ప్రోడక్ట్ లను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని పోలీసులు తెలియజేస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్