స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ… మరోసారి రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు రిమాండ్ పై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసిన ప్రకారం చంద్రబాబు రిమాండ్ను నవంబర్ ఒకటవ తేదీ వరకు పొడిగించింది. దీంతో నవంబర్ ఒకటవ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు ఖైదీ జీవితాన్ని అనుభవించనున్నారు. అయితే సెక్యూరిటీ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు కోర్టుకు తెలిపారు. దీనిపై లేఖ ద్వారా తమకు తెలియజేయాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
ఏసీబీ కోర్టు కీలక తీర్పు.. చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
0
265
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


