స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నపిల్లల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్లో ఓ బాలుడిని చంపేసిన ఘటన మరువక ముందే మరో బాలుడిని దారుణంగా చంపేశాయి. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కాలనీలో ఇవాళ ఉదయం బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుక్కల దాడిలో చనిపోయిన పిల్లాడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో ఆగని కుక్కల బెడద.. దాడిలో మరో బాలుడు మృతి
0
349
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


