తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అందరితో సరదాగా మాట్లాడుతుంటారు. ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ‘పాలమ్మిన.. పూలమ్మిన’ అనే డైలాగ్ తో ఆయన పాపులర్ అయ్యారు. తాజాగా మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో మల్లారెడ్డి ఆ ప్రాంత సమస్యల గురించి కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ మాట్లాడుతూ.. మల్లారెడ్డితో మామూలుగా ఉండదు.. ఆయన మాట్లాడితే మనం మాట్లాడటానికి ఏం ఉండదని వ్యాఖ్యానించారు. అలాగే మల్లారెడ్డి పాపులర్ డైలాగ్ ‘పాలమ్మిన.. పూలమ్మిన’ డైలాగ్ చెప్పి ప్రజల్లో జోష్ నింపారు.
“పాలమ్మిన.. పూలమ్మిన” డైలాగ్ చెప్పిన కేటీఆర్
0
273
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


