తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిర్మించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue)ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. దేశంలోనే ఎత్తైన విగ్రహం నిర్మాణానికి 2015లో శంకుస్థాపన చేయగా.. దాదాపు ఏడేళ్ల పాటు నిర్మాణం జరిగింది. నేడు అంబేద్కర్ 125వ జయంతి కావడంతో 125అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. మొత్తం 11ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది.
ఈ విగ్రహావిష్కరణకు ముందు హెలికాఫ్టర్ నుంచి అంబేద్కర్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ అంబేద్కర్(Ambedkar Statue) విగ్రహావిష్కరణతో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మరింత శోభ సంతరించుకుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం, లుంబిని పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి అంబేద్కర్ స్మృతివనం చేరింది.