Mallu Bhatti Vikramarka | దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని అన్నారు. నాడు కాంగ్రెస్ ఇచ్చిన భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు చేతనైతే ప్రైవేట్ వాళ్లకు ఇచ్చిన బొగ్గు గనులను తీసుకోండి. మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపించండి అంటూ డిమాండ్ చేశారు. ఇక ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి అంశం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు మహేశ్వర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.