ఏలూరు జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణంతో రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్, ఏలూరు మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కూడా ఆళ్ల నానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మృతి పట్ల బడేటి చంటి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు వేరైనా.. ఆళ్ల నానితో తనకు ఎప్పుడూ వివాదాలు లేవని, ఆత్మీయ సంబంధాలు కొనసాగాయని గుర్తుచేశారు. ఆళ్ల నాని మరణం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలకు, ప్రజలకు తీరని లోటని బడేటి చంటి అన్నారు.
‘ఆళ్ల నాని’కి రాజకీయ నాయకుల నివాళి
0
11
Latest Articles
ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రైవేట్ రంగంతో పాటు సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత విస్తరించనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిధిలోకి వచ్చే వేతన...
- Advertisement -
- Advertisement -


