విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు. తన కొడుకు బూడిద కావాలని, బూడిద ఇవ్వకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం.
సాయికృష్ణను ఎందుకు చంపారు.. కారణం ఏంటి..? సమాధానం చెప్పాలని తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేసింది. ఇంటికి వచ్చి తన బిడ్డని తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కడున్నారని అధికారిని ప్రశ్నించింది. తన కుమారుడు సాయికృష్ణ… పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, కానీ ఆయన నా కొడుకుని క్రిమినల్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజం తెలుసుకుని మాట్లాడాలని కోరారు.


