ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా జనసైనికుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ నిర్మాణ సారధుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు ఎమ్మెల్యే బాలరాజు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరు జనసేన నాయకుడు బొత్స మధు ఆయనపై దాడ చేయబోయాడు. వెంటనే అప్రమత్తమై దాడి చేసిన కార్యకర్తను అదుపు చేసి పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది లాక్కెళ్లారు. పోలవరం నియోజవర్గంలో వర్గ విభేదాలపై తొలిసారి బహిరంగ వ్యాఖ్యలు చేశారు జనసేన ఎమ్మెల్యే. పార్టీలో కొందరు నాయకులు, పెత్తందారులు తనపై కావాలని దుష్ప్రచారాలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బాలరాజు.
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం
0
72
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


