కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆమెతో పాటు వెళ్లిన కుక్క తెల్లవారుజామున చిన్నారి ఇంటి వద్దకు తిరిగి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు, డాగ్ క్యాచర్స్ సహాయంతో కుక్కను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కుక్క కీలక ఆధారంగా మారడంతో, దాని సంచార మార్గాలు, ప్రవర్తన ఆధారంగా చిన్నారి ఆచూకీపై పోలీసులు దృష్టి సారించారు. కుక్క ద్వారా కేసులో కొత్త ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం
0
63
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


