మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసును వెల్లడించలేదన్న ఆరోపణలతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ తిరస్కరించారు.
మీనాక్షి నటరాజన్ రాజ్య సభ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరు? అంటూ ప్రశ్నించారు.
ఆ వివరాలు ఇచ్చిన కాంగ్రెస్ కోవర్ట్ను పట్టుకోకుండా మీడియాలో బీజేపీ మీద అరుపులు ఎందుకు?.. అంటూ ఫైరయ్యారు. ముందు మీ పార్టీలోని కోవర్ట్లను పట్టుకొని అదుపులో పెట్టుకోండి.. అంటూ బీఎల్ సంతోష్ హెచ్చరించారు.


