శ్రుతికా బారన్వాల్.. ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించింది. ఆమెకు రబ్బర్, కెమికల్ , పాలిమర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఉద్యోగం లభించింది. ఢిల్లీకి వెళ్లి ఉద్యోగానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన కెరీర్ను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె మృతి చెందారు. శ్రుతికా బారన్వాల్ తన స్నేహితుడు, బ్యాచ్మేట్ అయిన అమన్ సింగ్తో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారిపోయిందని అమన్ తెలిపారు..
ఉద్యోగంలో చేరడానికి వచ్చి.. ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో మృతి
0
54
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


