అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ పరిధిలోని మజ్జివలస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు వచ్చిన నలుగురు సభ్యుల బృందాన్ని స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల తమ భూములు, జీవనాధారం దెబ్బతింటాయని, గ్రామాలు ముంపునకు గురవుతాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలని, జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సర్వే ప్రక్రియను కొనసాగించనివ్వబోమని హెచ్చరించారు.
మజ్జివలస గ్రామంలో ఉద్రిక్తత…హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
0
14
Latest Articles
ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించిన విజయ్
టీవీకే, కాంగ్రెస్ పార్టీ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఖాళీగా ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్కు...
- Advertisement -
- Advertisement -


