ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో భారీగా ఆక్రమణల కూల్చివేతను చేపట్టారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు.. అయ్యప్ప స్వామి గుడి వెనుక వైపు ఉన్న అటవీ శాఖ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టినట్టు సమాచారం. రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని SDFOహెచ్చరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.
ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో ఆక్రమణల కూల్చివేత
0
25
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్లో థార్...
- Advertisement -
- Advertisement -


