ఏపీ నేతలపై తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లయినా ఏపీలో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ సభ పెడతారని అంటున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామని.. మళ్లీ తమ జోలికొస్తే మూతి పళ్లు రాలతాయని అన్నారు. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఏపీ ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్.. ముందు సెక్రటేరియేట్లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలని..తర్వాత తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదు- కవిత
0
6
Latest Articles
హైదరాబాద్ బొల్లారం మహిళ హత్య కేసులో కీలక మలుపు.. భర్తే హత్య చేశాడని నిర్ధారణ
హైదరాబాద్ బొల్లారం ప్రాంతంలో మహిళ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తన భార్యను హత్య చేశారని భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల...
- Advertisement -
- Advertisement -


