ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం పదకొండున్నరకి నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో.. రేవంత్ రెడ్డి
0
195
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


