తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ వాస్తవానికి బీసీ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పారు. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని సీఎం అయ్యాక బీసీలలో ఆయన కులం కలుపుకున్నారని అన్నారు. గాంధీభవన్లో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జనాభా లెక్కలు ఎందుకు చేయలేదని మోదీని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కలతో పాటు కుల గణన చెయాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణ కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయాలన్నారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఆయన ఆరోపణలు చేశారు. సర్వే లో పాల్గొనని కేసీఆర్ కుటుంబాన్నీ సామాజిక బహిష్కరణ చేయాలని.. ఈ సభలో తీర్మానం ప్రవేశ పెడుతున్నానని అన్నారు..