ఏపీలో రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఇబ్రహీంపట్రం కేంద్రంగా కోట్లు విలువ చేసే ఆస్తులను ముఠా కొట్టేసింది. ఈ స్కామ్పై ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు లేఖ రాశారు.
వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునిల్, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ లపై ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను తనతో బలవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో సింగ్ పేర్కొన్నారు. దీనిపై సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి