నెల్లూరు జిల్లా కందుకూరులోని పెద్దబజారులో ఉన్న గాయత్రీ జ్యూయలర్స్ నగల దుకాణంలో అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారం ఎత్తుకుపోయారు. మరో రెండు కిరాణా షాపులలో కూడా వారు నగదు దొంగిలించారు. చోరీకి వచ్చిన వ్యక్తి సీసీ కెమెరాలను కట్ చేసి దొంగతనం చేశాడు. సీసీ కెమెరాలు కట్ చేయడానికి ముందున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. షాపు యజమాని రాజా దొంగతనం జరిగిన విషయం కందుకూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో గాయత్రీ జ్యూయలర్స్లో దొంగతనం
0
207
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


