ఆగస్టు 2న రాబోతున్న ‘ఉషా పరిణయం’

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో కె. విజయ్ భాస్కర్ ఒకరు. ఆయన స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ రాబోతుంది. `ఉషా పరిణయం ` అనే టైటిల్‌తో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను విడదలకు సిద్దం చేశారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని విజయభాస్కర్‌ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీ కమల్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయి పరిచయం కాబోతుంది .ఆగస్టు 2న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది అందరికి నచ్చుతుంది ,ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్ ,ఇదొక మంచి లవ్ స్టోరీ ,సినిమా లవర్స్ కు ఇదొక విందు భోజనంలా ఉంటుందన్నారు.. ఈ చిత్రం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు వెల్లడించారు.. ఇటీవల విడుదలైన పాటలకు ,టీజర్ కు మంచి స్పందన వచ్చింది’’ అని అన్నారు.

శ్రీ కమల్ ,తాన్వి ఆకాంక్ష,సూర్య,రవి,శివతేజ, అలీ, వెన్నెల కిశోర్ ,శివాజీ రాజా,ఆమని, సుధ, ఆనంద్, చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి, ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్ ,డీఓపీ: సతీష్ ముత్యాల , ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ,దర్శకత్వం- నిర్మాత : కె. విజయ్ భాస్కర్ .

Latest Articles

దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం వచ్చింది. తొలి హైడ్రోజన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలుకు పచ్చజెండా ఊపారు. హర్యానాలోని జింద్‌ నుంచి సోనిపట్‌ మధ్య ఈ హైడ్రోజన్‌ రైలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్