తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 6న భేటీ కాబోతున్నారు. ఇందుకు హైదరాబాద్లోని ప్రజా భవన్ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ విధివిధానాలు, చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించి ఓ క్లారిటీకి రానున్నారు. పదేళ్లలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్యలను సమీక్షిస్తారు. తెలం గాణ హక్కులకు భంగం కలగకుండా సమస్యల పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టనున్నారు. ఏపీ సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ఓ స్పష్టతకు రానున్నారు. ఉన్నతస్థాయి సమావేశం తర్వాత చంద్రబాబుకు సమాధానం ఇవ్వనున్నారు రేవంత్రెడ్డి
ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం
0
200
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


