17 లక్షలు పెట్టి కారు కొంటే సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చారని ఓ బాధితుడు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్ నాగోల్లో చోటుచేసుకుంది. శివకుమార్ అనే వ్యక్తి నాగోల్లోని మారుతి సుజుకి నెక్సా కళ్యాణి మోటర్స్ షోరూంలో మే 18న గ్రాండ్ విటారా కారు బుక్ చేసుకున్నాడు. అయితే అప్పుడు రోజులు కావని కొద్ది రోజులు ఆగిన బాధితుడు జూన్ 7న కారు డెలివరీ తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఓనర్ కొత్త కారు పీపీ కోటింగ్ కోసం షోరూంకు వెళ్లాడు. ఆ సమయంలో రిపెయింటింగ్, ఇంజన్ పార్ట్స్ తుప్పు పట్టడం గమనించాడు. ఇదేంటని అడిగితే తమకు సంబంధం లేదని చెపుతూనే బాధితుడిపై షోరూం సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు యాక్సిడెంట్ అయిన కారుకి పెయింటింగ్ వేసి కొత్త కారు అని డెలివరీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చైతన్యపురి పోలీస్ స్టేషన్లో యాజమాన్యం, సిబ్బందిపై బాధితుడు కంప్లైంట్ చేశాడు.
నాగోల్ మారుతి సుజుకి నెక్సా కళ్యాణి మోటర్స్ షోరూంలో నయా మోసం
0
337
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


