సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజవర్గ అభివద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నామ న్నారు. తనకు పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసిపి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిం చిన ప్రతి ఒక్కరికీ, ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసిపి కార్యకర్తలకు అండ గా ఉంటామని ప్రతిపక్ష పాత్రపోషించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వైసిపి కార్య కర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
అఖండ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు- వంగా గీత
0
494
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


