తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమేనని, అసలు సంబరాలు రేపు తాము చేస్తామని చెప్పారు. కౌంటింగ్కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అందరిని అప్రమత్తం గా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అలాగే కౌంటింగ్ పూర్తయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరు కేంద్రాల నుంచి బయటకు రావద్దని చెప్పామన్నారు. అలాగే రేపు 11గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చామని తెలిపారు. దేశమంతా ఒక నిబంధనైతే, ఏపీలో మాత్రం మరో నిబంధన దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పోస్టల్ బ్యాలెట్కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కొట్టేసిన ఎన్నికల కమిషన్ చేసింది తప్పే నని అందరికీ తెలుసని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీలోనే నిబంధనలు మార్చారు – సజ్జల
0
166
Previous article
Latest Articles
పుల్వామా దాడుల సూత్రధారి హతం
పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో హంజా బుర్హాన్ హతమైనట్టు తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్ హంజా...
- Advertisement -
- Advertisement -


