ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన తల్లి సరోజినీ దేవి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుగా రేపు సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్రావుకు కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.


