ఏపీలో కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అనంతపురంలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. దీనికి జిల్లా ఎస్పీ గౌతమిసాలి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. పోటీ అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బందికి సహకరించి ప్రక్రియ సాఫీగా జరిగేలా కృషి చేయాలని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుం దన్నారు. ఎవరూ గుంపులుగా ఉండరాదన్నారు. 30 పోలీస్ యాక్టు కూడా అమల్లో ఉందన్నారు. అను మతి లేకుండా ఎవరు ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిర్వహించరాదన్నారు. ఎవరైనా నిబంధ నలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిం చారు.


