తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటీ వెతలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది? అని ప్రభుత్వంపై నిప్పులుచెరి గారు.ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు.! నేడు విత్తనాలు కొందా మంటే అమ్మేటోడు లేడని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిద ర్శనం ఇంకేం కావాలి? అని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని మండిప డ్డారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా? అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంట లకు లైన్ లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? అని నిలదీశారు కేటీ ఆర్. గత పదేళ్లపాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
0
226
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


