మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీ లక్ష్మీనారా యణతోపాటు కొడుకు సాత్విక్పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ -62 లో దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. అయితే మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయ కుండా వేధింపులకు గురి చేశారని జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ వేశారని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.