భూ వివాదంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఓ వర్గం వారు కొంతమంది రౌడి మూకలను తీసుకొచ్చి, మరో వర్గంపై దాడి చేయించింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు గొడ్డలి, కర్రలు, కత్తి వంటి మారణాయు ధాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా మైసిరెడ్డిపల్లిలో భూవివాదం
0
481
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


