భూ వివాదంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో రెండు గ్రూపుల మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఓ వర్గం వారు కొంతమంది రౌడి మూకలను తీసుకొచ్చి, మరో వర్గంపై దాడి చేయించింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో పలువురు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. భూ యజమాని ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు గొడ్డలి, కర్రలు, కత్తి వంటి మారణాయు ధాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.