25.1 C
Hyderabad
Wednesday, July 30, 2025
spot_img

షర్మిలతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేకా కుమార్తె సునీత

వివేకా.. గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయిందని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నేటికి హత్య చేసిన వారికి చేయించిన వారికి శిక్ష లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలతో పాటు వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాని షర్మిల కోరారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం అని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. కరవు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే పదికి వందసార్లు ఆలోచిస్తామని, ఓటు వేసేముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత విజ్ఞప్తి చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్