Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

రాహుల్ నాయకత్వానికి అగ్నిపరీక్ష

   ఈసారి లోక్‌సభ ఎన్నికలు ….రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఆయనను తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని యావత్ కాంగ్రెస్ కుటుంబం కోరింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాహుల్ మనస్సు మార్చడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ మనసు మార్చుకోలేదు.

    రాహుల్ గాంధీ ఇక చెప్పినా, వినడని సోనియా గాంధీ డిసైడ్ అయ్యారు. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీయే కొనసాగారు. ఈ నేపథ్యంలో కిందటేడాది కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లికార్జు ఖర్గే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారికంగా మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటికీ, కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టేది గాంధీ కుటుంబమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో రాహుల్ గాంధీదే కీలక పాత్ర. కాంగ్రెస్ గెలిస్తే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంలోనూ అలాగే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలోనూ రాహుల్ గాంధీ మాటే చెల్లుబాటు అవుతుంది. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీయే అంటారు దేశ ప్రజలు.

   గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ విఫలమ య్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించినా, అది రాహుల్ ఖాతాలోకి రాదు. హిమాచల్ ప్రదేశ్లో ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీ. అంతేకాదు….ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై హిమాచల్ ప్రదేశ్‌పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఘనత గా చెప్పుకోవడానికి ఒకే ఒక్క కారణం ఉంది. హిమాచల్ ప్రదేశ్… సాదాసీదా రాష్ట్రం కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా స్వంత రాష్ట్రం. సాక్షాత్తూ బీజేపీ జతీయ అధ్యక్షుడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకున్నామని నాయకులు చెప్పుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ గెలుపు ఆస్కారం ఇచ్చింది. ఇక కిందటేడాది మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. అప్పటికి కర్ణాటకలో బస్వరాజ్ బొమ్మై నాయకత్వం లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచే కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేక పవనాలు వీయడం మొదలైంది. బొమ్మై సర్కార్ నలభై శాతం కమిషన్ ప్రభుత్వం అనే విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల్లో బొమ్మై సర్కార్ అవినీతే కీలకాంశంగా మారింది. బీజేపీ నాయకుల హిందూత్వ అజెండాను కన్నడ ప్రజలు పట్టించుకోలేదు. అవినీతి ప్రభుత్వాన్ని దింపేయాలని కన్నడ ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు కన్నడ ప్రజలు.

    కర్ణాటక తరువాత కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటికి గులాబీ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం అప్పగించారు తెలంగాణ ప్రజలు. అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అజెండాను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. గులాబీ పార్టీ పాలన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ ప్రభుత్వంపై వ్యక్తమైన అసంతృప్తి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి వరమైంది. చివరకు అనూహ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థి శిబిరాలపై వ్యక్తమైన అసంతృప్తే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చింది. కాగా ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు యుద్ధంతో సమానం. ఫలితాలు వచ్చే వరకు ప్రజల ఆదరన ఎవరికి ఉందో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాలపై ఎవరికీ ఎటువంటి ఉత్కంఠ లేదు. లోక్‌సభ ఎన్నికల్లో విజేతగా ఏ పార్టీ నిలుస్తుంది ? బీజేపీ యా ? కాంగ్రెస్సా ? అనే మీమాంస ఎవరికీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. ఈసారి 44 సీట్లు వస్తాయా ? ఈ సంఖ్య దాటుతుందా ? లేక తగ్గుతుందా ? ఈ అంశంపైనే చర్చ నడుస్తోంది. అంటే విజేత ఎవరో ప్రజలకు తెలిసిపోయిందన్న మాట.

    గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద నేతలు బయటకు వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ సహా అనేకమంది ఈ జాబితాలో ఉన్నారు. అందరూ వెళుతూ వెళుతూ రాహుల్ గాంధీపైనే విమర్శలు చేయడం విశేషం. రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. అయితే ఎవరు ఏం చెప్పినా, రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకోలేదన్న విమర్శలు వచ్చాయి. పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు, చర్చలు జరపడానికి ఆయన వ్యతిరేకమని రాహుల్ గురించి బాగా తెలిసివన వాళ్లు చెప్పేమాట. ఇప్పటికైనా రాహుల్ తన వ్యవహార తీరును మార్చుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడో విషయం గమనించాలి. రాహుల్ గాంధీ ఇష్టడి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. కుటుంబం అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఫలితంగా బలవంతంగా పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి. సహజంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు. కొంతకాలం రాజకీయాలపై దృష్టి పెడతారు.మరికొంతకాలం నెలల తరబడి విదేశాలకు విహారానికి వెళుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ నెగటివ్ ఇమేజే ఆయన పట్ల ప్రజలకు నమ్మకం కలగకపోవడానికి కారణమైందంటారు రాజకీయ విశ్లేషకులు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్