వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను సీఎం జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ ఫైనల్ జాబితాలో చోటు దక్కేదెవరికి…? టిక్కెట్ వచ్చేది ఎవరికి..? ఇప్పుడు ఇదే వైసీపీ నేతలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ మార్పు చేర్పుల్లో భాగంగా చాలా మంది నేతలకు జగన్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇన్ఛార్జ్లుగా ప్రకటించిన వారికైనా సీటు ఉంటుందో లేదో అన్న ఆందోళనలో నేతలు ఉన్నారు.


