పోలీసులు ఎన్ని తనిఖీలు చేపడుతున్నా.. గంజాయి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో భారీగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. ఒడిశాకు చెందిన అనంత కుమార్ బాలనగర్ లో ఓ చిన్న కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. నిత్యావసర సరుకులతో పాటు గంజాయి చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలా నగర్ ఎస్వోటీ పోలీసులు కిరాణా షాపుపై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా షాపులో మూడు ప్యాకెట్లలో 125 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడు అనంత కుమార్ గంజాయి చాక్లెట్లను ఒడిశా నుంచి హైదరాబాద్లోని బాలానగర్ ప్రాంతానికి తీసుకొచ్చి కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ బాలనగర్లో గంజాయి చాక్లెట్లు కలకలం
0
283
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


