స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 29న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా… వైఎస్సార్ వాహనమిత్ర 5వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం నగరంలోని విద్యాధరపురం స్టేడియంలో జరగనుంది. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు నిధులు విడుదల చేశారు. కాగా, రేపటి పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
రేపు వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధుల విడుదల
0
344
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


