స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 07.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహణ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉదయం 08:30 నుంచి 09:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో ఒంటి పూట బడుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది.
ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
0
435
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


