స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని హయత్నగర్ కు చెందిన రాజేష్ మృతి కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగుచూశాయి. రాజేష్ చనిపోవడానికి మూడు రోజుల ముందు ఓ టీచర్ ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు తాను చనిపోతున్నట్లు రాజేష్కు మెసేజ్ చేసింది. దీంతో నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతా అంటూ మెసేజ్ చేశారు రాజేష్. టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాక అదే రోజు ఇబ్రహీంపట్నంకు వెళ్ళాడు. ఇక అక్కడి నుండి ఎంతకీ తిరిగిరాని రాజేష్.. చివరికి శవమై తేలాడు. ఇదిలా ఉంటే.. రాజేష్ మరణంతో తమకు సంబంధం లేదంటున్నారు టీచర్ కుటుంబం. రాజేష్ని తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం వివాహేతర సంబంధమే రాజేష్ మరణానికి కారణమంటున్నారు.