స్వతంత్ర, వెబ్ డెస్క్: రీల్ నటుడు సోనూసూద్ కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన నుంచి సాయం పొందిన వారు అయితే ఏకంగా గుడి కూడా కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. కొంతమది అయితే సోనూ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కోవలోనే బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు సోనూసూద్పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. అందులో 100 మంది పిల్లలు చదువుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సోనూ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం చేశారు. అంతేకాదు కొత్తగా స్కూల్ బిల్డింగ్ను కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తాను కూడా భాగమవుతానని తెలిపారు. అనాథ పిల్లలను కలిసినట్లు వారితో దిగిన ఫొటోలను తన ట్వీట్ చేశారు.దీంతో మరోసారి నెటిజన్లు, ప్రముఖులు సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.